ప్రకాశం: CPI ఆధ్వర్యంలో ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త నిరసన సందర్భంగా మార్కాపురం సీపీఐ పూలసుబ్బయ్య భవన్లో నాయకులు పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేయాలని, అలాగే వృద్ధాప్య పెన్షన్ అందజేయాలని సీనియర్ నాయకులు అందే నాసరయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు .