సూర్యపేట మండలం పిన్నాయిపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ చింత భవాని మధు ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ వారి ఉచిత ఖాతాల ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్తులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు, ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఖాతాలు తెరిచే సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు.