SDPT: ఉపాధి హామీ కూలీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టం గ్రామీణ కూలీలకు ఎంతో ఉపయోగపడుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 100 రోజుల పనిదినాలను మాత్రమే కల్పించేవారని, ఇప్పుడు ఈ చట్టంతో 120 రోజులు వచ్చాయన తెలిపారు.