బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి షాక్ ఇస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే వెండి కేజీ ధర రూ.20 వేలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,41,220కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,29,450గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.