NLG: చిట్యాల మండలం వనిపాకలలో స్నేహితుడి జ్ఞాపకార్ధంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూర్వ విద్యార్థి 2014-15 బ్యాచ్కు చెందిన పీక మధు జ్ఞాపకార్థం, మిత్ర బృందం టెన్త్ విద్యార్థులకు బుధవారం పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, జామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. మధు కుటుంబ సభ్యులు సత్యనారాయణతో పాటు మిత్రులు మధు, రాకేష్, సాయి, శివాజీ పాల్గొన్నారు.