అబుదాబి వేదికగా ఈనెల 16 నుంచి IPL వేలం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్గా రూ.27 కోట్లతో రిషభ్ పంత్ ఉన్నాడు. ప్రస్తుతం జరగనున్న వేలంలో ఈ రికార్డు బద్దలవుతుందా..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, ఇది మినీ వేలం కావడంతో, ఫ్రాంచైజీల వద్ద తక్కువ ‘పర్స్ వాల్యూ’ ఉండటం వల్ల ఈ రికార్డు బ్రేక్ కావడం కష్టమే అని చెప్పవచ్చు.