NZB: వేల్పూర్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా దోపిడీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వేల్పూర్ కి చెందిన మంగళి సుదర్శన్ సోమవారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఊరికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 8 తులాల బంగారం, నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ సమచారం పోలీసులకు ఇవ్వడంతో కేసు నమేదు చేశారు.