KDP: పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొయిళ్ల కాల్వ గ్రామంలో SI మోహన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు సైబరు మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును ప్రజలకు వివరించి,అప్రమత్తంగా ఉండాలని కోరారు.