GDWL: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఇవాళ గద్వాల పట్టణంలోని నదీ అగ్రహారం వద్ద కృష్ణానదీ పుష్కరఘాట్ భక్తుల రద్దీతో నిండిపోయింది. ఉదయాన్నే పోటెత్తిన భక్తులు నదీలో పుణ్యస్నానాలాచరించారు. అనంతరం భక్తిభావంతో కార్తీకదీపాలు వెలిగించి నదిలోకి వదిలారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.