KRNL: కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. జిల్లా ఆస్పరికి చెందిన పి.కేశవరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూ.3,09,470 ఆర్ధిక సహాయాన్ని ఇవాళ ఆయన తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని తెలిపారు.