బాపట్ల-చీరాల జాతీయ రహదారిపై వెదుళ్ళపల్లిలోని చెవిటి, మూగ పిల్లల పాఠశాల వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు ఆ పాఠశాల ఉద్యోగి అని తెలిసింది. గతంలో ఇక్కడ పలు ప్రమాదాలు జరిగాయి. బధిరులైన విద్యార్థులు రోడ్డు దాటేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.