W.G: ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగిన మృతదేహం గ్రామ శివారులోని వరి చేలల్లో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు ఎస్సై జానా సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.