MLG: రామయ్య పల్లెలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గుగులోతు సోములు (53) అనే వ్యక్తి మంగళవారం రాత్రి బహిర్భూమికి వెళ్లగా పాము కాటుకు గురయ్యాడు. అది పురుగు కుట్టినట్లు భావించి ఇంటికి వచ్చి నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసేసరికి అతను మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.