NLG: జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా ఆరు నెలల నుంచి బియ్యం తీసుకోని వారి కార్డులను ప్రభుత్వం రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది. చనిపోయిన వారు, రెండేసి కార్డులో పేర్లు ఉన్నవారు జిల్లాలో 5,092 ఆనుమానాస్పద రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్డులో 4,103 మందిని అనర్హులుగా గుర్తించారు. వచ్చే నెల నుంచి ఆయా లబ్ధిదారులకు రేషన్ నిలిపివేయనున్నారు.