ప్రకాశం: రాచర్ల మండలం అన్నం పల్లె గ్రామంలో ఘర్షణ పడ్డ ఇరువర్గాలకు చెందిన 10 మందిపై కేసు నమోదు చేశామని మంగళవారం రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వెల్లడించారు. ఓ నగదు లావాదేవీల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయని ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని గిద్దలూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని ఎస్సై తెలిపారు.