HNK: ఐనవోలు మండలం వెంకటాపురంలో ఫర్టిలైజర్స్ షాప్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. న్యూ బిస్మిల్లా ఆగ్రో ఏజెన్సీ షాపులో సుమారు రూ. 1.78 లక్ష విలువచేసే కాలం చెల్లిన పెస్టిసైడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అమ్ముతున్న షాపును సీజ్ చేసి, షాపు యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.