AP: మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజకు సత్తెనపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెల్లవారుజామున పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఈ ఘటన పల్నాడులో చర్చనీయాంశంగా మారింది.