SRPT: డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని, డ్రగ్స్ మత్తులో జీవితం నాశనం అవుతుందని ఎస్పీ నరసింహ అన్నారు. ఈనెల 26న డ్రగ్స్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శుక్రవారం సాయంత్రం తెలిపారు. గంజాయి నుంచి మన పిల్లలను మనమే కాపాడుకోవాలని, డ్రగ్స్ బారిన పడకుండా పాటుపడాలని పిలుపునిచ్చారు.