అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పిలుపునిచ్చారు. సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వర్గాలంటూ లేకుండా అందరూ ఒకే తాటిపై నిలిచి పార్టీ కోసం పనిచేయాలన్నారు.