KKD: పిఠాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. దుర్గాడకు చెందిన మమత కాకినాడ వెళ్తుండగా.. రాపర్తి రోడ్డు వద్ద గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె చెల్లి కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.