MHBD: నర్సింహులపేట మండలంలోని పడమటి గూడెం గ్రామంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భవాన నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ తాపీ మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు అందరూ కలిసి కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.