TG: కులగణన సర్వేలో అంతా భాగస్వామ్యం కావాలాని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కొందరు కావాలనే సర్వేలో పాల్గొనడం లేదన్నారు. ‘ఎమ్మెల్సీ కవిత ట్వీట్లు పెట్టడం కాదు.. సర్వేలో పాల్గొనాలని తన కుటుంబానికి చెప్పాలి. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు. బీసీలపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తోంది. రాహుల్ గాంధీ కులం తెలుసుకోవాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి’ అని పేర్కొన్నారు.