SRPT: తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు అనంతారం గ్రామంలో శ్రీకంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆదివారం ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, గ్రామదేవతల పండుగలతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నారు.