కొనసీమ: మండల కేంద్రం ఆలమూరులో గత మూడు రోజులుగా పంచాయితీ కుళాయి నీరు సరఫరా కాకపోవడంతో త్రాగు నీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుందాపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.