WGL: చెన్నారావుపేట మండలం తిమ్మారాయనిపహాడ్లోని మొక్కజొన్న చేనులో మంగళవారం సందీప్ అనే యువరైతు పొలానికి వెళ్లగా అక్కడ కొండచిలువ కనిపించింది. భయానికి గురైన రైతు.. గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామానికి చెందిన యువకుల సహకారంతో ప్రాణంతో ఉన్న కొండచిలువను పట్టుకొని గ్రామపంచాయతీ ఆవరణలో తీసుకువచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.