ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ తమిమ్ అన్సారీయను ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.