SRPT: ఈనెల 7న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టే లక్ష డప్పులు, వేల గొంతుల సభకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య తెలిపారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు.