నల్గొండ: కనగల్ ఉన్నత పాఠశాలలో పురాతన నాగేంద్రుని రాతి విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. పాఠశాల్లో బాత్రూంల నిర్మాణం కోసం తవ్వకాలు నిర్వహిస్తుండగా ఈ విగ్రహం బయట పడిందన్నారు. ఈ విగ్రహం కాకతీయుల, రెడ్డి రాజుల పరిపాలనా కాలానికి చెందినదిగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ కనగల్ వాగులో ఓ విగ్రహం కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు.