పల్నాడు: గురజాల పట్టణంలోని కారంపూడి రోడ్లో యాక్సిస్ బ్యాంక్ సమీపంలోని ఓ నీటిబావిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుండి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.