మేడ్చల్: మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామంలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి(25)ని దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.