KDP: ఇకనుంచి గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులకు కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం ఈ పథకం కింద గుర్తించిన పనులను ఆ ఏడాదిలోనే పూర్తి చేయాలని, ఒకవేళ ఉపాధి పనులు పూర్తి కాకపోతే అందుకు కారణాలు తెలియజేయాలని, ఏడాదిలోగా పూర్తి చేసిన పనులకు మాత్రమే బిల్లులు మంజూరవుతాయని తెలిపింది.