అన్నమయ్య: పీలేరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెంచిన ఛార్జీలకు నిరసనగా శుక్రవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం తిరుపతి రోడ్డు మార్గం డిఈ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నడ్డి విరిచి గడిచిన ఆరు నెలలకే ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మండిపడ్డారు.