సత్యసాయి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది. పట్టణాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ ఉదయం వరకు జిల్లాలో 157.2 mm వర్షపాతం నమోదయింది. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 26.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కదిరిలో 21, గాండ్లపెంటలో 9.8, ఆమడగూరులో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.