VZM: పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. తెగుళ్లు వల్ల, తుఫాన్ ప్రభావం వల్ల వరి, అపరాలు పంటల రైతులు నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం ఈ నష్టం పై సమగ్రంగా పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరారు.