NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. క్రిస్టమస్ తాత వేషాదారణ ప్రయాణికులను ఆకట్టుకుంది.