MDK: ఝరాసంగంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రుద్రాభిషేకం, గుండం పూజ, కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి పూలమాల శాలువాతో సన్మానించారు.