BDK: మణుగూరు మండలం సాంబాయిగూడెంలో BRS పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు పార్టీల నుండి 20 కుటుంబాల వారు BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.