VSP: లోక్ అదాలత్లో 31 మద్యం కేసులు రాజీ అయినట్లు అరకు ఎక్సైజ్ సర్కిల్ సీఐ సంతోష్ తెలిపారు. అరకులోయ సివిల్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో 30 డ్యూటీ పెయిడ్ లిక్కర్ (DPL) కేసులు, ఒకటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(NDPL)కేసు రాజీ అయ్యాయన్నారు. ఈ 31 కేసుల రాజీ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పినాల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.1,56,360లు జమయ్యాయన్నారు.