ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా రూ. 1, 23, 032 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ. 53,450 లడ్డు ప్రసాదం అమ్మకం ద్వారా రూ. 18,820 శాశ్వత అన్నదాన విరాళం ద్వారా రూ. 48,242 ఇతర విరాళాల ద్వారా రూ. 2,520 ఆదాయం రావటం జరిగిందన్నారు.