సత్యసాయి: జగన్ పాలన అంతా అప్పులమయమేనని, ఐదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధి కూటమి ప్రభుత్వం 5 నెలల్లోనే చేసి చూపించిందని మంత్రి సవిత అన్నారు. సోమవారం ఆమె పెనుకొండలో మాట్లాడారు. రాష్ట్రానికి తరలొస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులే అభివృద్ధికి నిదర్శమన్నారు. తాము 5 నెలల కాలంలో చేసిన అభివృద్ధి చర్చకు సిద్ధమని జగన్కు మంత్రి సవిత సవాల్ విసిరారు.