ATP: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గుత్తి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి అమరజీవి యైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని వారు పేర్కొన్నారు.