రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా దివంగత షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. గతంలో ఎంపీగా పనిచేసిన సందీప్.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజవర్గంలో మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో తలపడనున్నారు. ఈ స్థానంలో కేజ్రీవాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.