బాపట్ల: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల టీడీపీ క్రైస్తవ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు హాజరయ్యారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.