KRNL: పాణ్యం మండల కేంద్రంలోని స్థానిక రచ్చకట్టకు చెందిన బొమ్మినేని శ్రావణి(33) మంగళవారం ఆరోగ్య, ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం పాణ్యం సీఐ కిరణ్ కుమార్రెడ్డి వివరాలు తెలిపారు. ఈమెకు బనగానపల్లె మండలం ఎనగండ్లకు చెందిన బొమ్మినేని బాలసుంకన్నతో 14 ఏళ్ల క్రితం వివాహం అయినట్లు తెలిపారు.