నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీసులని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తనకు భద్రత కల్పించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా.. రిపోర్టర్పై దాడి కేసులో మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.