సిరిసిల్ల: ఫీజు రీయింబర్స్మెంట్ పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల పర్ష రాములు అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు మంగళవారం వినతిపత్రం అందించారు. జిల్లా అధికార ప్రతినిధి రమేశ్, కార్య దర్శి మల్లేశం, అరుణ్, తేజ, కర్ణాకర్, మహేశ్, బాలయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.