కృష్ణా: ప్రభుత్వ విధుల పట్ల అంకితభావంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లోని అర్హత గల అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంకితభావంతో అప్పగించిన విధులు నిర్వర్తించి, తాము పనిచేస్తున్న శాఖలో అధికారుల మన్ననలు పొందాలన్నారు.