AKP: గొలుగొండ మండలం సీహెచ్. నాగాపురంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి కే.సుధారాణి రైతుల వరి పొలాలను పరిశీలించి ప్రస్తుతం వరి కోతల చేస్తున్న సమయంలో రైతలు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.