AP: విభజన అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో చర్చకు నోటీసులు ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో శ్రద్ద తీసుకోవాలని సూచించారు.