JN: జిల్లాలో గల అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో గల అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన అధికారులు, DMHO, DWO, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.